నా నెక్స్ట్ టార్గెట్ అదే.. సీఎం ఎన్నిక వేల డీకే శివకుమార్ కామెంట్స్

-

కర్ణాటక ఫలితాలు బీజేపీయేతర రాష్ట్రాలకు ఎంతో సంతృప్తినిచ్చాయి. పదేళ్ల తర్వాత స్పష్టమైన మెజార్టీతో కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో విజయఢంకా మోగించింది. అయితే ఆ తదుపరి కార్యక్రమానికి మాత్రం ఈ పార్టీ తర్జనభర్జన పడుతోంది. కర్ణాటక సీఎంగా ఎవరిని ఎన్నుకోవాలనేదానిపై తలలు పట్టుకుంటోంది. అయితే మాజీ సీఎం సిద్ధరామయ్య.. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్​.. సీఎం కుర్చీ కోసం పోటీ పడుతుండగా సిద్ధకే కుర్చీ లాంఛనమనేది ఎక్కువగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే సీఎం ఎంపిక గురించి డీకే శివకుమార్ స్పందించారు.

‘వచ్చే ఏడాది జరగనున్న లోకసభ ఎన్నికల్లో 20 సీట్లు గెలవడమే ప్రస్తుతం మా ముందున్న సవాలు. నేను ఎవరినీ విడదీయాలనుకోవడం లేదు. నేనొక బాధ్యతాయుతమైన వ్యక్తిని. ఎవరినీ వెన్నుపోటు పొడవను. బ్లాక్‌మెయిల్ చేయను. నా మీద ఎలాంటి మచ్చ లేకుండా చూసుకోవాలనుకుంటున్నా. పార్టీ వల్లే నేను ఈ స్థానంలో ఉన్నాను. పార్టీనే మా ఇల్లు. మేమంతా కలిసి దానిని నిర్మించుకున్నాం. సోనియా గాంధీ మాకు రోల్‌ మోడల్‌. మాకు పార్టీ రాజ్యాంగం ముఖ్యం. కాబట్టి దాని ప్రకారమే అందరి ప్రయోజనాలు కాపాడాలి’ అని శివకుమార్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news