మత మార్పిడులను రాజకీయం చేయొద్దు – సుప్రీం కోర్ట్

-

మత మార్పిడులను రాజకీయం చేయవద్దని సూచించింది సుప్రీం కోర్ట్ ధర్మసనం. మతమార్పిడి అనేది తీవ్రమైన సమస్య అని.. అది రాజకీయ రంగు పులుముకోకూడదని వ్యాఖ్యానించింది. మోసపూరిత మతమార్పిడులను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్రాలకు దిశా నిర్దేశం చేయాలని దాఖలైన పిటిషన్ పై అటార్నీ జనరల్ వెంకటరమణి సహాయాన్ని సోమవారం న్యాయస్థానం కోరింది.

SUPRIME COURT IN NEW DELHI ON MONDAY PICTURE BY PREM SINGH 19 APRIL 2010

ప్రలోభాలతో మతమార్పిడులు జరిగితే ఏం చేయాలి? దిద్దుబాటు చర్యలు ఏమిటి? అనే అంశాలపై అటార్నీ జనరల్ చెప్పాలని ధర్మాసనం కోరింది. విచారణ ప్రారంభంలో తమిళనాడు తరపు సీనియర్ న్యాయవాది విల్సన్ ఈ పిటిషన్ ను రాజకీయ ప్రేరేపిత పిల్ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో అలాంటి మార్పిడుల ప్రశ్న లేదని అన్నారు విల్సన్.

Read more RELATED
Recommended to you

Latest news