చిరుతపులిని బంధించిన యువకుడు..వీడియో వైరల్

-

చిరుతపులితో ఓ యువకుడు ఒక ఆట ఆడుకున్నాడు. తన పై దాడి చేసిన చిరుతపులిని బైక్ మీద బందించి అటవీశాఖ అధికారులకు అప్పగించాడు సదరు యువకుడు. ఈ సంఘటన కర్నాటక – హాసన్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

కర్నాటక – హాసన్ జిల్లాలోని అరసీకెరె తాలూకా గండాసి హోబ్లీ బాగివాలు గ్రామానికి చెందిన వేణుగోపాల్ అలియాస్ ముత్తు అనే యువకుడు శుక్రవారం ఉదయం పొలానికి వెళ్తుండగా చిరుతపులి దాడి చేసింది. దీంతో ఆ యువకుడు ధైర్యం చేసి చిరుతను వెంబడించి బైక్‌పై తాడుతో చుట్టి బంధించాడు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా అటవీశాఖ సిబ్బంది చిరుతను చికిత్స చేయించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news