రైల్వే స్టేషన్ లో కాన్పు చేసిన మహిళా కానిస్టేబుల్స్

-

దేశంలో చాలా వరకు కూడా వైద్య సేవల విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తు ఉంటాయి. చాలా మంది మహిళలకు కనీసం కాన్పు చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది అనే ఆరోపణలు మనం వింటాం. కొన్ని ప్రాంతాల్లో మహిళలు రోడ్ల మీద కాన్పు చేసే ఘటనలు ఎన్నో వార్తల్లో వింటున్నాం, చూస్తున్నాం. ఈ క్రమంలోనే కొందరు ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి మనం చూసాం.

తాజాగా మహారాష్ట్రలో పన్వెల్ రైల్వే స్టేషన్ వెయిటింగ్ రూమ్‌లో 25 ఏళ్ల మహిళ ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆమెకు నొప్పులు రావడంతో అక్కడ ఉన్న మహిళా కానిస్టేబుల్స్ వెంటనే వెయిటింగ్ రూమ్ లో కాన్పు చేసారు. ఆమె కోజికోడ్ నుండి హజ్రత్ నిజాముద్దీన్ వెళ్తున్నదని అక్కడి అధికారి ఒకరు మీడియాతో అన్నారు. తల్లి మరియు బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని సెంట్రల్ రైల్వే ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news