మోడీ సంచలన నిర్ణయం..”భారత్”గా మారనున్న “ఇండియా” !

-

ప్రధాని నరేంద్ర మోడీ సంచలనం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియా గా ఉన్న మన దేశ పేరును భారత్ గా మార్చేందుకు సిద్ధమయ్యారట. దేశం పేరు భారత్ గామార్చేందుకు అడుగులు వేస్తుందట మోడీ సర్కార్. అందులో భాగంగానే కీలక నిర్ణయాలు తీసుకుందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది.

దీని కోసమే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తోంది. అయితే తాజాగా అస్సాం సిఎం హిమంత బిస్వా శర్మ కూడా ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా ట్వీట్‌ చేయడంతో… నిజంగానే ఇండియా పేరును భారత్ గా మార్చేందుకు కసరత్తు మొదలైందని అందరూ చర్చించుకుంటున్నారు.  G20 ఆహ్వానంలో కూడా ఇండియాకు బదులు భారత్‌ అని పేర్కొన్నారు.విపక్షాల కూటమి పేరు ఇండియా ఉండటంతో భారత్ గా మార్చేందుకు మోడీ సర్కారు ప్రయత్నాలు చేస్తూ ఉండని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news