షాకింగ్ : అమాంతం పెరిగిపోయిన బంగారం, వెండి ధరలు..!

-

గత కొన్ని రోజులుగా తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ అమాంతం పెరిగిపోయాయి. పెరిగిన బంగారం ధరలతో పసిడి ప్రియులు ఖంగుతిన్నారు. ఇక బంగారం బాటలో నడిచిన వెండి ధర కూడా పెరిగింది. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ. 180 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 53,530 కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల ధర రూ. 160 పెరగడంతో రూ. 49,070 కు చేరుకుంది. ఇక బంగారం బాటలోనే వెండి కూడా ప్రయాణించింది.

కేజీ వెండి ధర రూ. 400 పెరిగింది. దీంతో ధర రూ. 68,300 కు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం రూ. 150 మేర పెరగడంతో రూ. 54,540 చేరుకుంది. అలాగే రూ. 140 పెరుగుదలతో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,000 కి చేరుకుంది. ఇక అంతర్జాతీయంగా చూసుకుంటే బంగారం ధర ఔన్స్‌ కు 1966 డాలర్లకు చేరగా. వెండి ధర ఔన్స్‌ కు 27.43 డాలర్లకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news