మళ్ళీ షాక్ ఇచ్చిన బంగారం.. నిలకడగానే వెండి..!

-

గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర మళ్ళీ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో పసిడి ప్రియులు నిరాశ చెందుతున్నారు. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ. 610 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 54,270 కి చేరింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 560 పెరుగుదలతో రూ. 49,750 కు చేరింది. అయితే వెండి ధర మాత్రం నిలకడగానే ఉంది. కేజీ వెండి ధర రూ. 50 తగ్గింది. దీంతో ధర రూ.65,500 కి చేరింది.

Gold-2
 

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధర పరుగులు పెడుతుంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం రూ. 820 పెరగడంతో రూ.55,200 చేరుకుంది. అలాగే రూ.750  పెరుగుదలతో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,600 కి చేరుకుంది. మ‌రోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పరుగులు పెట్టింది. బంగారం ధర 1935 డాలర్ల పైకి చేరింది. వెండి ధర 27.09 డాలర్లకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news