ఒక్కో భార్యతో మూడు రోజులుండు.. సండే నీ ఇష్టం : ఓ వ్యక్తికి కోర్టు సూచన

-

ఇరువురి భామల కౌగిలిలో స్వామీ.. ఇరుకున పడి నీవు నలిగితివా.. అనే పాటలో ఉన్న లిరిక్స్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఓ వ్యక్తికి కరెక్ట్​గా సూట్ అవుతాయి. ఎందుకంటే అతడు కూడా ఇద్దరు భార్యల నడుమ నలిగిపోతున్నాడు. తన కోసం ఇద్దరు భార్యలు గొడవపడుతుంటే చూడలేక చివరకు కోర్టును ఆశ్రయించాడు. మరి కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే..?

మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రస్తుతం హరియాణాలోని మల్టీనేషనల్‌ కంపెనీలో ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడికి 2018లో గ్వాలియర్‌ ప్రాంతానికి చెందిన మహిళతో వివాహమైంది. 2020లో లాక్​డౌన్ విధించినప్పుడు తన భార్యను పుట్టింటికి పంపాడు. లాక్​డౌన్ ఎత్తివేసినా కూడా ఆ తర్వాత ఆమెను తీసుకెళ్లలేదు. అంతేకాకుండా హరియాణాకు వెళ్లి తన కంపెనీలో ఓ మహిళను రెండో వివాహం చేసుకున్నాడు.

ఏళ్లు గడుస్తున్నా తన భర్త తనని తీసుకెళ్లడం లేదని అనుమానమొచ్చిన మొదటి భార్య హరియాణాకు వెళ్లే సరికి తన భర్త రెండో పెళ్లి విషయం బయటపడింది. న్యాయం కోసం ఆమె గ్వాలియర్​లోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా వారికి ఆరు నెలలపాటు కౌన్సెలింగ్ ఇచ్చింది ముగ్గురికి సయోధ్య కుదిర్చారు. వారంలో ఒక్కో భార్య దగ్గర మూడ్రోజులు ఉండాలని.. ఆదివారం తన ఇష్టమని భర్తకు కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ తీర్పు తర్వాత ఆ భర్త తన భార్యలిద్దరికీ చెరో ఫ్లాట్‌ కొనిచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news