జైలులో నన్ను ఏం చేస్తారో తెలియదు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

-

మరో రెండు రోజుల్లో జైలుకు వెళుతున్నానని, ఈ సారి జైళ్లో ఎంతకాలం ఉంచుతారో తెలియదు. కానీ నేను వచ్చే వరకు పథకాలన్ని కొనసాగుతాయని ఢిల్లీ సీఎం కేజ్రివాల్ అన్నారు. సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేసిన ఆయన ప్రజలకు సందేశం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారానికి సుప్రీంకోర్టు నాకు 21 రోజుల సమయం ఇచ్చిందని, అది ముగియడంతో ఎల్లుండి నేను తిరిగి తీహార్ జైలుకు వెళ్తాను అని చెప్పారు. ఈసారి నన్ను ఈసారి ఎంతకాలం జైలులో ఉంచుతారో నాకు తెలియదు. కానీ నియంతృత్వం నుండి దేశాన్ని రక్షించడానికి జైలుకు వెళుతున్నందుకు గర్విస్తున్నానన్నారు.

నేను జైలులో ఉన్నప్పుడు వారు నన్ను లొంగదీసుకోవడానికి ప్రయత్నించారు, కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదని తెలిపారు. నన్ను జైల్లో ఎన్నో రకాలుగా చిత్రహింసలకు గురి చేశారని, నా మెడిసిన్ కూడా నిలిపివేశారని, వారు ఎందుకు అలా చేశారో.. వారికి ఏం కావాలో నాకు అర్ధం కాలేదన్నారు. నేను జైలుకు వెళ్లినప్పుడు నా బరువు 70 కిలోలు ఉండగా.. ఇప్పడు 64 కిలోలకు వచ్చిందని, ఈ వ్యక్తులు ఏమి చేశారో నాకు తెలియదు కానీ నేను జైలు నుంచి విడుదల అయినప్పటి నుంచి బరువు పెరగడం లేదని తెలిపారు. డాక్టర్లు పలు రకాల టెస్టులు చేసి.. ఇది శరీరంలో ఏదో ఒక తీవ్రమైన వ్యాధికి సంకేతంగా ఉందని తెలిపారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news