నా తల నరికినా నేను గౌహతి మార్గంలో వెళ్ళను: సంజయ్ రౌత్

-

మహారాష్ట్ర లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మధ్య శివసేన నేత సంజయ్ రౌత్ కు ఎదురు దెబ్బ తగిలింది. భూ కుంభకోణం కేసులో ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. మంగళవారం విచారణకు హాజరు కావాలని కోరింది. పాత్ర చాల్ భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో సంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసు 2007 నాటిది కాగా ఆ సమయంలో మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. ముఖ్యమంత్రిగా విలాస్ రావ్ దేశ్ముఖ్ పనిచేస్తున్నారు.

కాగా ఈ నోటీసులపై సంజయ్ రౌత్ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తనకు ఇప్పుడే తెలిసింది అన్నారు. తాము బాలాసాహెబ్ శివసైనికులమని, ఇప్పుడు పెద్ద యుద్ధం చేస్తున్నామని, ఇది తనను అడ్డుకునే కుట్ర అని మండిపడ్డారు.” నువ్వు నా తల నరికినా.. నేను గౌహతి మార్గంలో వెళ్ళను.. నన్ను అరెస్టు చేయండి.. జైహింద్” అంటూ సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news