పసిడి ప్రియులకు షాక్…. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

-

బంగారం దిగిరాను అంటోంది. క్రమంగా ధరలు పెరుగుతున్నాయి. పెరిగిన ధరలు పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్నాయి.  ప్రస్తుతం వివాహ ముహూర్తాలు ఉండటంతో బంగారానికి విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. దీనికి తోడు రష్యా- ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు కూడా బంగారం ధరలు పెరిగేందుకు కారణం అవుతున్నాయి. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి బంగారం ధరలు కొండెక్కుతున్నాయి.

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 300 పెరిగి రూ. 49,850కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 320 పెరిగి రూ. 54,380కి చేరింది. మరోవైపు వెండి ధరలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. పెరుగుదలలో బంగారంతోొ పోటీ పడుతున్నాయి. కిలో వెండి ధర రూ. 1000కి పెరిగింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.75,200 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వచ్చే రెండు నెలలు క్రమంగా వివాహ ముహూర్తాలు ఉండటంతో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో బంగారం కొనుగోలు చేసేవారిపై భారం పడనుంది.

Read more RELATED
Recommended to you

Latest news