ఎయిర్ ఇండియాలో కొలువుల జాతర.. 5100 మందికి అవకాశం

-

ఎయిర్‌లైన్స్​ కంపెనీ ఎయిర్​ ఇండియా ఉద్యోగార్థులకు గుడ్​న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఏకంగా 5100 మందిని నూతనంగా విధుల్లోకి తీసుకోనున్నట్లు ప్రకటించింది. దేశంలోని అనేక నగరాలతో పాటు అంతర్జాతీయంగా తమ కార్యకలాపాలను విస్తరిస్తున్న వేళ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారందరికీ ఈ రిక్రూట్​మెంట్​లో అవకాశం కల్పిస్తామని ఎయిర్ ఇండియా తెలిపింది. ఎంపికైన వారిలో సేవా నైపుణ్యాలను పెంపొందించేందుకు 15 వారాల ప్రత్యేక శిక్షణను కూడా ఇవ్వనున్నట్లు చెప్పింది. ఈ శిక్షణను పొందే అభ్యర్థుల కోసం ముంబయిలో ప్రత్యేకంగా తరగతి గదులతో పాటు పలు ఫ్లైట్లలో ట్రైనింగ్​కు ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రకటించింది.

“కొత్తగా తీసుకునే ప్రతిభావంతుల ద్వారా ఎయిర్​ ఇండియా సేవలు మరింత వేగం పుంజుకుంటాయని ఆశిస్తున్నాం. వీటితో పాటు భవిష్యత్తులో మరి కొంతమంది పైలట్లు సహా ఇంజనీర్లను కూడా నియమించుకునే యోచనలో ఉన్నాం.” అని ఎయిర్​ ఇండియా సర్వీసెస్ అధినేత సందీప్ వర్మ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news