బ్రేకింగ్: చీఫ్ జస్టీస్ గా ఎన్వీ రమణ ప్రమాణం

-

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టీస్ ఎన్వీ రమణ ప్రమాణం చేసారు. ఆయన చేత భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. అతి తక్కువ మంది అతిధులు హాజరైన ఈ కార్యక్రమంలో కరోనా జాగ్రత్తలు తీసుకుని ప్రమాణ స్వీకారం చేసారు. ప్రధాన మంత్రి మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా అతి తక్కువ మంది హాజరు అయ్యారు. పలువురు కేంద్ర మంత్రులు హాజరు అయ్యారు.

కృష్ణా జిల్లా పొన్నవరంలో ఆయన జన్మించారు. 48 వ సీజేగా ఎన్వీ రమణ ప్రమాణం చేసారు. సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టీస్ గా బాధ్యతలు చేపడుతున్న రెండో తెలుగు వ్యక్తి ఎన్వీ రమణ కావడం గమనార్హం. అమరావతిలో ఆయన బీఎస్సీ పూర్తి చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news