తొలిరోజు కంగనా ప్రచారం.. కాంగ్రెస్సే టార్గెట్..!

-

బీజేపీ నుంచి తనకు సీటు రాగావే.. కాంగ్రెస్ నేతలు చీప్ పాలిటిక్స్ ప్లే చేశారని మండిపడ్డారు కంగనా రనౌత్. మండి లోక్ సభ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్ లోని మండి సిటీలో తొలిరోజు భారీ ర్యాలీ చేపట్టారు. బీజేపీ శ్రేణులు కంగనాకు భారీ స్వాగతం పలికారు. ఆమెపై పూలవర్షం కురిపించారు. ప్రచారంలో భాగంగానే కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ ప్రసంగించారు.

తనకు బీజేపీ నుంచి సీటు రాగానే చీప్ పాలిటిక్స్ ప్లే చేశారని మండిపడ్డారు. తన అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ అంగీకరించలేకపోయిందని చెప్పుకొచ్చారు. ఇక రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. శక్తికి వ్యతిరేకంగా పోరాడుతామని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. మహిళలను కించపరిచేలా రాహుల్ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నీచ రాజకీయాలకు తెరలేపిందని ఆగ్రహం తెలిపారు. మరోవైపు కంగనా రనౌత్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్ మహిళా నేత సుప్రియా సోషల్ మీడియాల అసభ్యకర పోస్ట్ పెట్టడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news