తెలంగాణలో కూడా కర్ణాటక ఫలితాలు రిపీట్ అవుతాయి – పవన్ ఖేరా

-

కర్ణాటకలో కాంగ్రెస్ చారిత్రక విజయం సాధించిందన్నారు ఆ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా. బిజెపి 9 ఏళ్లలో ధరలు పెంచి పేదలను ఇబ్బందుల్లోకి నెట్టిందని మండిపడ్డారు. ప్రధాని మోదీ ఎన్ని ర్యాలీలు చేసినా ఆయనని ప్రజలు ఆదరించలేదన్నారు. మోడీ ర్యాలీ చేసిన చోట కూడా బిజెపిని ఓడించారని.. టిప్పు సుల్తాన్ మొదలుకొని కేరళ హిస్టరీ లాంటివన్నీ బిజెపి ప్రదర్శించిందన్నారు. అయినప్పటికీ కర్ణాటక ప్రజలు బిజెపికి సమాధానం చెప్పారని అన్నారు పవన్ ఖేరా.

బిజెపి లాగా మా పార్టీలో ముఖ్యమంత్రిగా ఎంపిక ఉండదని.. ఢిల్లీ నిర్ణయించదని తెలిపారు. అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకునే ముఖ్యమంత్రిని ప్రకటిస్తామన్నారు. ఇక తెలంగాణలో కూడా కర్ణాటక ఫలితాలు రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఇచ్చిన హామీలు మొదటి క్యాబినెట్ లోనే అమలు చేశామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news