Maharastra: కుప్పకూలిన భవనం.. ప్రమాదంలో 19 మంది

-

మహరాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉణ్న జీ+2 భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. బాంద్రా వెస్ట్ లోని శాస్త్రి నగర్ లో  ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 19 మంది చిక్కుకోగా.. ఇందులో 40 ఏళ్ల వ్యక్తి మరణించాడు. మరో 18 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో చిక్కుకున్న వారందరు బీహార్ కూలీలే అని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు.

ప్రమాదం బుధవారం అర్ధరాత్రి  12.30 జరిగింది. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే ఫైర్ సర్వీస్ అధికారులు, పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడారు. ప్రస్తుతం 17 మంది ఆస్పత్రిలో చికిత్స పొంది డస్చార్జ్ కాగా.. మరొకరు చికిత్స పొందుతున్నారు. ఘటనకు గల కారణాలు ఆరా తీసే పనిలో ఉన్నారు అధికారులు. వెంటనే సహాయక చర్యలు అందడంలో బాధితులను కాపాడేందుకు అవకాశం దొరికింది. లేకపోతే పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడేది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news