మండపంలో వరుడి ముందే వధువును పెళ్లి చేసుకున్న లవర్.. వివాహం క్యాన్సిల్

-

కల్యాణ మండపంలో ఓ యువకుడు చేసిన పనితో ఆ వివాహం రద్దయింది. కాసేపట్లో వధువు మెడలో మూడు ముళ్లు పడాల్సి ఉండగా.. ఆ వధువు నుదుట ఓ యువకుడు సింధూరం దిద్ది వరుడికి షాక్ ఇచ్చాడు. అసలేం జరిగిందంటే..?

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజిపుర్‌ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువతి, యువకుడు గతంలో ప్రేమించుకున్నారు. ఆ తర్వాత విడిపోయారు. ఈ నేపథ్యంలో ఆ యువతికి వేరే గ్రామానికి చెందిన అబ్బాయితో వివాహం నిశ్చయించారు. ఈ నెల 17న పెళ్లి వేడుక జరుగుతుండగా.. ఆ యువకుడు వధూవరులు ఉన్న వేదికపైకి వచ్చి వధువు నుదుటన సిందూరం దిద్దాడు.

దీంతో అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. దీనిని గమనించిన వరుడు తనకీ పెళ్లొద్దంటూ తేల్చిచెప్పేశాడు. పెళ్లి మండపం నుంచి వరుడు సహా అతడి బంధువులు వెనుదిరిగారు. మరోవైపు పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుణ్ని గ్రామస్థులు పట్టుకుని చితకబాదారు. అతణ్ని పోలీసులకు అప్పగించారు. గతంలోనూ అతడు యువతి వివాహాన్ని చెడగొట్టినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news