IPL 2023 : గుజరాత్ పై ముంబై సంచలన విజయం.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం

-

ఐపీఎల్ 2023 చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇకనిన్న ఐపిఎల్ లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ పై ముంబై ఇండియన్స్ 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. 219 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు… 20 ఓవర్లలో 191 పరుగులకే పరిమితమైంది. దీంతో ముంబై ఇండియన్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.

అంతేకాదు ప్లే ఆఫ్ ఆశలను కూడా సజీవంగా ఉంచుకుంది ముంబై ఇండియన్స్. ఇక గుజరాత్ బ్యాటర్ లో మసీద్ ఖాన్ పోరాడిన విజయం దక్కలేదు. అటు మిల్లర్, విజయ శంకర్ బాగా ఆడారు. ఇది ఇలా ఉండగా… గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ రషీద్ ఖాన్ ఐపిఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు. బౌలింగ్లో నాలుగు వికెట్లు అలాగే బ్యాటింగ్ లో 79 పరుగులు చేసి ఈ ఫీట్ సాధించిన నాలుగు ఆటగాడిగా నిలిచాడు రషీద్ ఖాన్. నిన్న 10 సిక్సర్లు కొట్టిన రషీద్ ఖాన్ ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టేలెండర్ గా చరిత్ర సృష్టించాడు. చేజింగ్ టీం తరఫున ఎక్కువ సిక్సర్లు బాదిన లిస్టులో కూడా చేరిపోయాడు రషీద్ ఖాన్. జై సూర్య 11 సిక్సర్లు కొట్టగా… గిల్ క్రిస్ట్, పోలార్డు మరియు రషీద్ ఖాన్ లు పదేసి సిక్స్ లు కొట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news