దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే : మంత్రి ఆతిశీ

-

దిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అరెస్టయి ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ అన్నారు. దిల్లీ ప్రభుత్వ పాలన జైలు నుంచి సాగబోదన్న లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వ్యాఖ్యలపై ఆతిశీ స్పందించారు. ఏ రాజ్యాంగ నిబంధన ఆధారంగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించారు.

‘ప్రజా ప్రాతినిధ్య చట్టం మేరకు ఎవరైనా చట్టసభ సభ్యుడు దోషిగా తేలితేనే వారి సభ్యత్వం రద్దవుతుందు. ఏ ఇతర అవకాశం లేనప్పుడు మాత్రమే రాష్ట్రపతి పాలన విధించాలని సుప్రీంకోర్టు కూడా పలుమార్లు స్పష్టం చేసింది. ఈడీ మీ చేతిలో ఉంది. వారికి ఎటువంటి ఆధారాలు అవసరం లేదు. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద అరెస్టు అయ్యే నేతలు బెయిల్‌ పొందలేరు. దీనికింద అందరు విపక్ష సీఎంలు అరెస్టవుతారు. అప్పుడు వారు రాజీనామా చేయడం, ప్రభుత్వాన్ని పడగొట్టడం లేదా రాష్ట్రపతి పాలన విధించడం.. ఇదే వారి ఫార్ములా’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ దిల్లీ మంత్రి ఆతిశీ ఆరోపణలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news