Odisha accident: ఇవాళ సంతాప దినంగా ప్రకటించిన ఒడిశా

-

కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాద సంఘటన నేపథ్యంలో ఒడిస్సా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఒడిస్సా రాష్ట్రంలో సంతాప దినంగా ప్రకటించనుంది. ఈ మేరకు ఎలాంటి అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించకూడదని.. రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. కాగా మరికాసేపట్లోనే ఒడిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంఘటన స్థలానికి చేరుకుని… అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు.

కాగా, ఒడిస్సా లో కోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదంలో ఏపీలోని విజయవాడకు చెందిన 120 మంది ప్రయాణికులు ఉన్నారు. వారు కోల్కత్తా నుంచి విజయవాడకు వస్తున్నట్లు సమాచారం. అయితే వారికి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం అందుతోంది. ఈ తరుణంలోనే విజయవాడ హెల్ప్ లైన్నెం బర్లను…086667055,2576924 రైల్వే శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news