రోజూ దేవుణ్ని ప్రార్థిస్తున్నాడని మరణశిక్ష జీవితఖైదుగా మార్పు

-

మైనర్ బాలికపై హత్యాచారం కేసులో దోషిగా తేలిన ఓ వ్యక్తికి పోక్సో కోర్టు విధించిన మరణ శిక్షను ఒడిశా హైకోర్టు జీవిత ఖైదుగా మార్చి సంచలన తీర్పునిచ్చింది. అయితే దీనికి గల కారణాన్ని కూడా వివరించింది. ఆ కారణం తెలిసి ప్రజలు షాక్ అవుతున్నారు. దీనిపై నెట్టింట వివిధ రకాలుగా స్పందనలు వస్తున్నాయి. ఇంతకీ ఆ కారణం ఏంటంటే?

ఆరేళ్ల బాలికపై హత్యాచారం కేసులో దోషిగా తేలిన ఎస్‌కే ఆసిఫ్‌ అలీకి ఒడిశాలోని జగత్‌సింగ్‌పుర్‌లో ఉన్న పోక్సో కోర్టు విధించిన మరణశిక్షను ఒడిశా హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది. దీనికి సంబంధించి జూన్‌ 27వ తేదీన 106 పేజీల తీర్పును వెలువరించింది. తీర్పు ఇచ్చే క్రమంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

 

ఈ కేసులో దోషిగా తేలిన ఆసిఫ్‌ అలీ రోజూ దేవుణ్ని ప్రార్థిస్తున్నాడని.. అతడు దేవుడి ముందు లొంగిపోయాడని కోర్టు పేర్కంది. తాను చేసిన నేరాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడని తెలిపింది. అందుకే అతడికి విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మారుస్తున్నామనిహైకోర్టు వ్యాఖ్యానించింది. బాధిత బాలిక కుటుంబానికి రూ.1.50 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని పోక్సో కోర్టు ఆదేశించగా.. దాన్ని సవరించిన న్యాయస్థానం రూ.10 లక్షలు అందించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news