బీజేపీని గద్దె దించేందుకు.. విపక్షాల భేటీ షురూ

-

వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ సర్కార్​ను గద్దె దింపడమే లక్ష్యంగా విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. మోదీ సర్కార్​ను కూలగొట్టడానికి వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విపక్ష నేతలంతా బిహార్ రాజధాని పట్నాలో భేటీ అయ్యారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అధ్యక్షతన పట్నాలో ప్రతిపక్ష నేతల భేటీ జరుగుతోంది.

ఈ సమావేశంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బంగాల్‌ సీఎం మమతా బెనర్జీ(టీఎంసీ), తమిళనాడు సీఎం స్టాలిన్‌ (డీఎంకే), పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ (ఆప్‌), జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ (జేఎంఎం) సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే (శివసేన-యూబీటీ), సీపీఎం, సీపీఐ, పీడీపీకి చెందిన నేతలు పాల్గొన్నారు. 80 లోక్​సభ సీట్లున్న ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి ఒక్క సమాజ్‌వాదీ పార్టీ మాత్రమే హాజరుకావడం చర్చనీయాంశమైంది. అయితే దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ హాజరు కాలేదు. ఆప్​ తరఫున ఆ పార్టీ ఎంపీ రాఘవ్​ చద్ధా హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news