ధన్​బాద్ అగ్నిప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన మోదీ

-

ఝార్ఖండ్ ధన్​బాద్​లోని అపార్ట్మెంట్​లో జరిగిన అగ్నిప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఘటనపై మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50వేల ఎక్స్​గ్రేషియా ప్రకటించారు. మరోవైపు ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.

ధన్​బాద్​లోని జోడా పాఠక్ ప్రాంతంలోని ఆశీర్వాద్ టవర్ అపార్ట్​మెంట్​లో అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 14 మంది సజీవదహనం కాగా.. మరికొంత మంది మంటల్లో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అపార్ట్​మెంట్​లో 400 మంది ఉంటున్నట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. వెంటనే మంటలు ఆర్పే ప్రక్రియ ప్రారంభించాయి. మృతుల్లో నలుగురు చిన్నారులు సైతం ఉన్నారని అధికారులు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version