కేసీఆర్ కు పదేళ్లు పడితే.. రేవంత్ రెడ్డికి ఆరు నెలలే పట్టింది : ఈటల రాజేందర్

-

రేవంత్ రెడ్డికి అధికారం నెత్తికెక్కింది. ఎవరిని లెక్క చేయని స్థాయికి రేవంత్ రెడ్డి ఎదిగి పోయారు. కేసీఆర్ కు అధికారం నెత్తికెక్కడానికి పదేళ్లు పట్టింది. రేవంత్ రెడ్డికి ఆరు నెలలు మాత్రమే పట్టింది అని రైతు దీక్ష వేదికగా మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. రేవంత్ రెడ్డికి సంపూర్ణ అవగాహాన అనుభవం ఉంది అనుభవం లేనిది ప్రజలకే. మోసానికి మారు పేరు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీని సైతం బూరడి గొట్టించిన ఘనత రేవంత్ రెడ్డిది. లేనిపోని హామీలతో రేవంత్ రెడ్డి నమ్మించగలిగారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని నాడు చెప్పాను, నేడు చెబుతున్న. రేవంత్ రెడ్డి మోసపు మాటలను నమ్మి ప్రజలు ఓట్లేశారు. రైతు రుణ మాఫీ ఎంత మొత్తం చేశారో దమ్ముంటే రేవంత్ రెడ్డి పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. నాడు కాంగ్రెస్ పార్టీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీనీ మూసివేస్తే, 6300 కోట్లతో రీ ఓపెన్ చేసిన ఘనత మోడీది. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పోతే రేవంత్ రెడ్డి భరతం పడతామని ఈ వేదిక నుంచి హెచ్చరిక చేస్తున్నాం అని ఈటల తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version