దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని విజయదశమి విషెస్

-

దేశవ్యాప్తంగా విజయదశమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రజలంతా తమ కుటుంబాలతో సంతోషంగా పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ ఖడ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ దసరా పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని.. సుఖసంతోషాలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

విజయదశమి సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. అనైతికతపై నీతి, అసత్యంపై సత్యం, చెడుపై మంచి సాధించిన విజయానికి ఈ దసరా ప్రతీక. ఈ పండగ దేశ ప్రజలందరిలో సంతోషం, శాంతి తీసుకురావాలి.. – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్

విజయానికి ప్రతీక అయిన విజయదశమి సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాక్షలు. ఈ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో ధైర్యం, సంయమనం, సానుకూల శక్తి తీసుకురావాలని కోరుకుంటున్నాను – ప్రధాని నరేంద్ర మోదీ

Read more RELATED
Recommended to you

Latest news