కేంద్ర-రాష్ట్ర సైన్స్‌ సదస్సును ప్రారంభించిన మోదీ

-

ప్రధాన మంత్రి మోదీ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నిర్వహిస్తున్న కేంద్ర-రాష్ట్ర సైన్స్‌ సదస్సును ప్రారంభించారు. దేశంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన శాస్త్ర (సైన్స్‌), సాంకేతిక (టెక్నాలజీ), సృజనాత్మక (ఇన్నోవేషన్‌) వ్యవస్థను నిర్మించడంలో కేంద్ర-రాష్ట్రాల పరస్పర సమన్వయం, సహకార యంత్రాంగాన్ని బలోపేతం చేయడం కోసం రెండు రోజుల పాటు ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, యువ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

కేంద్రం నిర్వహించే కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వాలు దూరంగా ఉండటం ఈ మధ్య తరచుగా జరుగుతోంది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్ర-రాష్ట్ర సైన్స్‌ సదస్సును ప్రారంభించగా.. ఝార్ఖండ్‌, బిహార్‌ హాజరుకాలేదు. దీంతో ఆ రాష్ట్రాలపై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు గుప్పిస్తోంది. గైర్హాజరీపై ఆయా రాష్ట్రాల నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు.  ‘‘ఆ రెండు రాష్ట్రాలకు సైన్స్‌, ఇన్నోవేషన్‌ అంత ప్రాధాన్యం కాదేమో’’ అంటూ బీజేపీ వర్గాలు వ్యంగ్యాస్త్రాలు గుప్పిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news