రాజకీయాల కోసం ప్రధాని మోదీ తల్లిని అవమానించారు – స్మృతి ఇరానీ

-

ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. ఆప్ నేత గోపాల్ ఇటాలియ గతంలో ప్రధాని మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ట్విట్టర్లో షేర్ చేస్తూ ఆప్ నేతలపై విరుచుకుపడ్డారు. ఆ వీడియోలో గోపాల్ ప్రధాని మోదీ తల్లి హీరా బెన్ ను కించపరుస్తున్నట్లుగా ఉంది. ఈ వ్యాఖ్యలపై స్మృతి ఇరానీ స్పందిస్తూ.. రాజకీయం కోసం ప్రధాని తల్లిని అవమానించారని మండిపడ్డారు.

ప్రచారం కోసం ఆప్ నేతలు చేసే వ్యాఖ్యల వల్ల గుజరాత్ ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయని అన్నారు. ప్రధాని తల్లి చేసిన తప్పు ఏంటి? అని ప్రశ్నించారు. మోదీ, ఆప్ రాజకీయాలను అడ్డుకుంటున్నారని అతని తల్లిని అవమానించారని పేర్కొన్నారు. గుజరాత్ ఎన్నికలలో ఆప్ ఓడిపోవడం ఖాయమన్నారు స్మృతి ఇరానీ. కేజ్రీవాల్.. మీ ఆశీస్సులతో మోడీ తల్లిని గోపాల్ ఇటాలియ కించపరిస్తూ మాట్లాడారని ట్వీట్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news