ప్రధాని మోదీ రాజీనామా చేయాలి – కేఏ పాల్

-

ఒడిశా రైలు ప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. రైలు ప్రమాద ఘటన చాలా దురదృష్టకరమని అన్నారు. వందలాదిమంది చనిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ నరేంద్ర మోదీ ప్రధాని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైల్వే శాఖ మంత్రి ఎవరో ఎవరికీ తెలియదని అన్నారు.

అన్ని శాఖలను మోడీ తన గుప్పిట్లో పెట్టుకున్నాడని.. కాబట్టి ఈ ఘటనకు ఆయనే బాధ్యుడని అన్నారు. బాధ్యులైన అధికారులందరినీ విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గత 40 సంవత్సరాలలో ప్రపంచంలో ఇంత ఘోర ప్రమాదం ఎక్కడా జరగలేదన్నారు కేఏ పాల్. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news