BREAKING : ఒడిశా రైలు ప్రమాదంలో 300కు చేరిన మృతులు !

-

BREAKING : ఒడిశా రైలు ప్రమాదంలో 300కు మృతుల సంఖ్య చేరే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వెయ్యి మందికి పైగా క్షతగాత్రులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. భువనేశ్వర్‌, కటక్‌ చుట్టుప్రక్కల ఆస్పత్రుల్లో గాయపడ్డవారికి చికిత్స అందిస్తున్నారు అధికారులు.

2 రైళ్లలో తెలుగువాళ్లు 200 మంది ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కోరమండల్‌ రిజర్వేషన్‌ జాబితాలో పలువురు తెలుగువాళ్లు కూడా ఉన్నట్లు గుర్తించారు అధికారులు. చనిపోయినవాళ్లలో ఎక్కువమంది తమిళ ప్రయాణికులు ఉన్నారు. ఇక మరి కాసేపట్లో భువనేశ్వర్‌కు ప్రధాని మోడీ.. చేరుకోనున్నారు.

ఇక, ఒడిస్సా రైలు ప్రమాద ఘటనపై నటి రష్మిక మందన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద వార్త వింటే గుండె తరుక్కుపోతుంది. మరణిం చిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news