‘పీఎం విశ్వకర్మ’ పథకం ప్రారంభం… అర్హులు, అర్హతలివే

-

పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ నిన్న శ్రీకారం చుట్టారు. నిన్న విశ్వకర్మ జయంతి సందర్భంగా చేతివృత్తుల వారి కోసం రూ. 13 వేల కోట్లతో ‘పీఎం విశ్వకర్మ’ పథకాన్ని మోడీ ప్రారంభించారు. ద్వారకా సెక్టార్ 21 నుంచి 25 వరకు పొడిగించిన ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ లైన్ ను మోడీ ప్రారంభించారు. ప్రయాణికులతో కలిసి మెట్రో రైలులో ప్రయాణించారు. వారితో సెల్ఫీలు దిగుతూ కాసేపు ముచ్చటించారు.

PM Modi To Launch Vishwakarma Scheme
PM Modi To Launch Vishwakarma Scheme

పీఎం విశ్వకర్మ.. అర్హులు, అర్హతలివే

చేతులు,, టూల్ కిట్ల సాయంతో పనులు చేసుకునే 18 ఏళ్లు పైబడిన వారు అర్హులు. ఆధార్, అడ్రస్, ఫోన్ నెంబర్, క్యాస్ట్ సర్టిఫికెట్, బ్యాంకు పాస్ బుక్, ఫోటో సాయంతో దరఖాస్తు చేయవచ్చు. వడ్రంగులు, పడవలు తయారు చేసేవారు, కమ్మరి, స్వర్ణకారులు, కుమ్మరి, విగ్రహాల తయారీదారులు, చర్మకారులు, తాపీ మేస్త్రీలు, బాస్కెట్/నారతాళ్లు చేసేవారు, నాయి బ్రాహ్మణులు, పూలదండలు తయారు చేసేవారు, రజకులు, దర్జీలు, చేప వలల తయారీదారులు అర్హులు.

Read more RELATED
Recommended to you

Latest news