సుప్రీంకోర్టు తీర్పును ప్రశంసించిన ప్రధాని మోడీ..!

-

లంచం కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఎలాంటి మినహాయింపులూ ఇవ్వకూడదంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వాగతించారు. ఇదో గొప్ప తీర్పు అంటూ ప్రశంసించారు. సుప్రీం తీర్పు వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని పెంచుతుందని అభిప్రాయపడ్డారు. ‘సుప్రీంకోర్టు గొప్ప తీర్పు ఇచ్చింది. అది భవిష్యత్తులో స్వచ్ఛమైన రాజకీయాలను నిర్ధారిస్తూ.. వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని పెంచుతుంది’ అని మోడీ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. ఈ పోస్టుకు సుప్రీం తీర్పునకు సంబంధించిన కథనాన్ని కూడా జత చేశారు.

లంచం కేసులో చట్టసభ సభ్యులకు మినహాయింపు లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. చట్టసభల్లో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకుంటే రక్షణ కల్పించలేమని తేల్చి చెప్పింది. ఆర్టిక‌ల్ 105, 194ను సాకుగా చూపి వాళ్లు విచార‌ణ నుంచి త‌ప్పించుకోవ‌డం కుద‌ర‌ద‌ని సుప్రీం ధ‌ర్మాస‌నం తెలిపింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నం ఈ తీర్పును ఇచ్చింది. ఆ బెంచ్‌లో జ‌స్టిస్ ఏఎస్ బొప్పన్న‌, ఎంఎం సుంద్రేశ్‌, పీఎస్ న‌ర‌సింహ‌, జేబీ ప‌ర్దివాలా, పీవీ సంజ‌య్ కుమార్, మ‌నోజ్ మిశ్రా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news