ఎంపీలకు ప్రధాని మోడీ కీలక సూచనలు..ముస్లింలకు దగ్గర కావాలి !

-

బిజెపి ఎంపీలకు ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. సోదర భావాన్ని పెంపొందించేందుకు ముస్లిం మహిళలకు రక్షాబంధన్ రోజున చేరువ కావాలని ఎంపీలకు సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పశ్చిమబెంగాల్, ఒడిశా, ఝార్ఖండ్ ఎంపీలతో సమావేశంలో ఈ సూచనలు చేసినట్లు సమాచారం.

దీంతోపాటు ప్రభుత్వం ఆయా వర్గాలకు తీసుకొచ్చిన అభివృద్ధిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించినట్లు పేర్కొన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఇంకా దూసుకుపోవాలని కూడా పేర్కొన్నారు. ప్రజల అవసరాల మేరకు మెలగాలిని ఆదేశించారు ప్రధాని మోడీ.

Read more RELATED
Recommended to you

Latest news