ప్రపంచమంతా ఆత్మ నిర్భర్ భారత్ గురించే చర్చ : ప్రధాని మోడీ

-

భారత పార్లమెంట్ భవనం, సెంట్రల్ హాల్ లో ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యం అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఇవాళ సెంట్రల్ హాల్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ప్రపంచం అంతా ఆత్మనిర్బర్ భారత్ గురించే చర్చిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. భారత యూనివర్సిటీలు ప్రపంచ వ్యాప్తంగా ఎదగాలని కోరారు. చిన్న చిన్న విషయాలపై రాద్దాంతం చేయకూడదు.

ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం భారత్. అత్యధిక యువత కూడా ఈ మధ్య కాలంలో కొత్తగా 150 నర్సింగ్ కళాశాలను ప్రకటించుకున్నాం. రాజకీయాల కోసం కొన్ని నిర్ణయాలు వాయిదా వేయకూడదు. ప్రపంచ మంతా మనల్ని మిత్రుడిగా చూస్తుంది. మనకు 75 ఏళ్ల అనుభవం ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మనం ఉండాలి. అత్యధిక యువత ఉన్న దేశం మనదే కావడం గర్వించదగ్గ విషయం. ప్రపంచంలో మన యువత అగ్రస్థానంలో ఉండాలి. మనం క్వాలిటీ పై ఫోకస్ పెట్టాలి. మన క్రీడాకారులు అంతర్జాతీయ వేదికపై రాణిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news