బ్యాంకులో చొరబడ్డ ముసుగు దొంగ.. బాంబుతో బెదిరించి డబ్బుతో పరార్

-

రాజస్థాన్​లో పట్టపగలే బ్యాంకు దోపిడీ జరిగింది. ముసుగు ధరించి బ్యాంకులోకి వచ్చిన ఓ ఆగంతుకుడు.. బాంబుతో సిబ్బందిని బెదిరించి రూ.24 లక్షలతో పరారయ్యాడు. జైపుర్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మాస్కు ధరించిన ఓ దుండగుడు గురువారం రోజున జైపుర్ లోని హర్‌సావా ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేటు బ్యాంకులోకి ప్రవేశించాడు. బ్యాంకులో ఉన్న సొమ్మంతా తనకు ముట్టజెప్పాలని సి.. లేదంటే తన వద్ద ఉన్న బాంబును పేల్చేస్తానని బెదిరించాడు. భయపడ్డ బ్యాంక్​ సిబ్బంది మొదట రూ.1.25 లక్షలు దుండగుడికి తీసిచ్చారు. వాటితో సంతృప్తి చెందని దొంగ.. మరింత డబ్బును డిమాండ్ చేశాడు.

ఈ క్రమంలోనే క్యాషియర్ గదిలోకి ప్రవేశించిన దుండగుడు.. మొత్తం 24 లక్షల రూపాయల వరకు బ్యాగులో సర్దేశాడు. అనంతరం సిబ్బందిని లోపలే ఉంచి.. బ్యాంకు మెయిన్​ గేటుకు తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యాడు దొంగ. దోపిడి జరిగిన సమయంలో బ్యాంకు లోపల కస్టమర్​లెవ్వరూ లేరని సిబ్బంది తెలిపారు. ఘటన అనంతరం బ్యాంకు సిబ్బంది పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని పట్టుకునే పనిలో పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news