పంజాబ్ రైతుల ఆగ్రహం.. నేడే రైల్ రోకో.

-

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు ఇరు సభల్లో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుల వల్ల వ్యవసాయదారులకి డైరెక్టుగా కార్పోరేట్లతో సంబంధం ఏర్పడుతుందని, మధ్యవర్తులు ఉండరని కేంద్రప్రభుత్వం చెబుతుంది. మరోపక్క రైతులుఈ బిల్లుల వల్ల రైతులకి నష్టం కలుగుతుందని, కనీస మద్దతు ధర తగ్గుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా చోట్ల బిల్లులకి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

CAPTION- Farmers block Beas bridge during protest against the three agriculture ordinances introduced by the Center at Beas on Monday, September 14 2020. EXPRESS PHOTO BY RANA SIMRANJIT SINGH

ప్రస్తుతం వ్యవసాయ బిల్లులకి రాష్ట్రపతి ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది. ఐతే వ్యవసాయ బిల్లులపై వ్యతిరేకంగా పంజాబ్ రైతులు నేటి నుండి మూడు రోజుల పాటు రైల్ రోకో చేపట్టనున్నారు. సెప్టెంబర్ 24నుండి 26వరకు రైల్ రోకో చేపట్టనున్నారు. ఈ మేరకు ప్రతిపక్ష పార్టీలు రైతులకి అండగా నిలుస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news