వీల్ చైర్ లో వచ్చి..సీఎం స్టాలిన్‌ నే బురిడీ కొట్టించాడుగా !

-

ఇండియన్ క్రికెట్‌ టీం కెప్టెన్‌ అని సిఎం స్టాలిన్ ను బురిడి కొట్టించిన యువకుడుపై కేసు నమోదు చేశారు తమిళనాడు పోలీసులు. సిఎం సహా మంత్రులకు, ప్రజలను మోసం చేసినా ఘటనపై పలు కేసులు నమోదు చేసి.. అరెస్టు చేశారు. వీల్ చైర్ క్రికెట్ లో కెప్టెన్ గా పాకిస్తాన్ పై అడి గెలిచాలిపించానంటూ అందరినీ మోసం చేశాడు యువకుడు వినోద్ కుమార్.

తమిళనాడు రాష్ట్రం రామనాధపురం చెందిన వినోద్ కుమార్…లండల్ జరిగిన ప్రపంచ కప్పులో ఇండియా తరపున అడినట్లు సిఎం స్టాలిన్ కు చెప్పాడు. వినోద్ కుమార్ మాటలు నమ్మి ..అతనికి భారీ స్ధాయిలో ఆర్ధిక సహాయం చేశారు స్దానికులు, మంత్రులు. స్టాలిన్ సైతం అతనికి అభినందనలు తెలిపారు. కొందరి క్రీడాకారుల ఫిర్యాదుతో లోతుగా విచారణ చేపట్టారు పోలీసులు. వినోద్ కుమార్ మొత్తం అబద్ధాలు చెప్పి అందరినీ మోసం విచారణలో తేలింది. కలకత్తాలో జరిగిన ఓ మ్యాచ్‌లో ఆడి …అక్కడే ఒక కప్పుకొని.. లండల్ మ్యాచ్ అంటూ కలరింగ్ ఇచ్చినట్లు తమిళనాడు పోలీసులు తేల్చి.. వినోద్‌ ను బొక్కలో వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news