రోజూ రాత్రి దీన్ని చిటికెడు తీసుకోండి చాలు.. శరీరంలో ఉండే కొవ్వు మొత్తం వెన్నలా కరిగిపోతుంది..

-

ఈ మధ్య మనుషులు శారీరక శ్రమను తగ్గించారు.. తిన్న తిండికి కనీసం పావు వంతు కూడా కష్టపడటం లేదు.. దాంతో ఒంట్లో కొవ్వు పేరుకు పోతుంది..అధిక బరువుతో పాటు పొట్ట, తొడలు, పిరుదులు వంటి వివిధ శరీర భాగాల్లో కొవ్వు పేరుకుపోయి మనలో చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్నారు.. అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి..తీపి పదార్థాలను ఎక్కువగా తినడం, మారిన జీవనశైలి వంటి వివిధ రకాల కారణాల చేత మనలో చాలా మంది అధిక బరువు బారిన పడుతున్నారు. శరీరంలో కొవ్వు పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవడానికి మనలో చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. అయితే మీ కోసం అద్భుతమైన చిట్కాను తీసుకొని వచ్చాము.. అదేంటో వివరంగా తెలుసుకుందాం..

ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం 50 గ్రాముల సోంపును, అర టేబుల్ స్పూన్ పసుపును, 25 గ్రాముల అవిసె గింజలను, 25 గ్రాముల జీలకర్రను, 25 గ్రాముల కరివేపాకు పొడిని, 25 గ్రాముల కరక్కాయ పొడిని, అర టేబుల్ స్పూన్ సైంధవ లవణం, 2 చిటికెల ఇంగువను ఉపయోగించాల్సి ఉంటుంది…ముందుగా కళాయిలో అవిసె గింజలను వేసి దోరగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. అలాగే జీలకర్ర, సోంపును కూడా విడివిడిగా వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఈ పదార్థాలను ఒక జార్ లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలను వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో పావు టేబుల్ స్పూన్ మోతాదులో కలిపి తీసుకోవాలి. దీనిని రాత్రి భోజనం చేసిన ఒక గంట తరువాత తీసుకోవాలి. మరిన్ని అద్భుత ప్రయోజనాల కోసం దీనిని ఉదయం, మధ్యాహ్నం కూడా తీసుకోవచ్చు.

తీసుకున్న ప్రతిసారి గోరు వెచ్చని నీటిలో పావు టేబుల్ స్పూన్ మోతాదులో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. అలాగే దీనిని వాడినన్ని రోజులు ఎటువంటి జంక్ ఫుడ్ ను తీసుకోకూడదు. అలాగే క్రమం తప్పకుండ వ్యాయామం చెయ్యాలి..అప్పుడే సులువుగా బరువును తగ్గుతారు..ట్రై చెయ్యండి..

Read more RELATED
Recommended to you

Latest news