శ్రీనగర్‌లో రాహుల్‌-ప్రియాంక స్నోబాల్‌ ఫైట్‌.. వీడియో వైరల్‌

-

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమం శ్రీనగర్‌లో జరుగుతోంది. ఈ కార్యక్రమం కోసం శ్రీనగర్ వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ అక్కడ కాసేపు ఫైట్‌ చేశారు. గడ్డకట్టిన మంచులో ఒకరినొకరు సరదాగా ఆటపట్టించుకున్నారు. స్నోబాల్స్‌ విసురుతూ నవ్వులు చిందించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన భారత్‌ జోడో యాత్ర ముగింపు కార్యక్రమంలో భాగంగా శ్రీనగర్‌లో ఈ సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ఈ దృశ్యాలను రాహుల్ ట్వీట్‌ చేయగా.. అవి కాస్తా వైరల్‌గా మారాయి.

కాంగ్రెస్ నేతలు, భద్రతా సిబ్బంది అంతా వెంట ఉన్న సమయంలో రాహుల్ తన సోదరి ప్రియాంకను ఆటపట్టించారు. చాటుగా స్నో బాల్స్‌ తీసుకొని ఆమె తలపై వేశారు. ప్రియాంక కూడా అలాగే తన సోదరుడితో ఆడుకున్నారు. అతడి చేతులు వెనక్కి లాగి, తలపై మంచు ముద్దలు వేశారు. తర్వాత ఇద్దరు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. పక్కనే ఉన్న మరికొందరిపై కూడా రాహుల్ ఈ స్నోబాల్స్ విసిరారు. అందమైన ఉదయం అంటూ ఈ వీడియోను షేర్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news