ఒకేసారి రెండు రైళ్లకు సిగ్నల్.. అందుకే ప్రమాదం!

-

ఒడిశా రైలు ప్రమాదం.. దేశవ్యాప్తంగా విషాదం నెలకొల్పింది. ఇప్పటికి 278 మంది ఈ ఘటనలో మృతి చెందారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న మరో 900 మందిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం బాలేశ్వర్​ జిల్లాలో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి.

ఎటు చూసినా ఆర్తనాదాలు.. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో భయానక వాతావరణం నెలకొంది. ఈ ప్రమాదంతో రైళ్లలో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒకేసారి రెండు రైళ్లకు సిగ్నల్ ఇచ్చారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బోగీ నుంచి బయటకు దిగినప్పుడు రైల్వే లైన్‌ విద్యుత్‌ తీగలు కిందకి తగిలేలా వేలాడుతున్నాయని చెప్పారు. అదృష్టం కొద్దీ వాటిలో విద్యుత్‌ సరఫరా లేకపోవడం వల్ల మరింత ప్రాణ నష్టం తప్పిందని అంటున్నారు.

ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ బాలేశ్వర్‌ సమీపంలోని బహానగా బజార్‌ వద్ద శుక్రవారం రాత్రి దాదాపు ఏడు గంటల ప్రాంతంలో తొలుత పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ఫలితంగా దాని బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడ్డాయి. వాటిని షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. దాంతో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పదిహేను బోగీలు బోల్తాపడ్డాయి. అనంతరం బోల్తాపడ్డ కోరమండల్‌ కోచ్‌లను పక్కనున్న ట్రాక్‌పై దూసుకొచ్చిన గూడ్సు రైలు ఢీకొంది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడం వల్ల ప్రమాదం తీవ్రత పెరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news