రికార్డు స్థాయిలో షిర్డీసాయికి కానుకలు

-

భారత్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో సుప్రసిద్ధమైన షిర్డీకి కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత భారీస్థాయిలో భక్తులు పోటెత్తుతున్నారు. తమను కరుణించాలని బాబాను వేడుకుంటూ హుండీలో కానుకలు సమర్పిస్తారు. ఈ ఏడాది బాబా సంస్థాన్​కు రూ.398 కోట్లకు పైగా కానుకలు వచ్చాయి. ఈ విషయాన్ని సాయి సంస్థాన్​ చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ ఆఫీసర్​ భాగ్యశ్రీ బనాయత్ తెలిపారు.

కొవిడ్ విజృంభణ తగ్గిన తర్వాత ప్రపంచ దేశాల నుంచి సుమారు మూడు కోట్ల మంది భక్తులు బాబా దర్శనార్థం విచ్చేశారని భాగ్యశ్రీ తెలిపారు. గతేడాది అక్టోబరు నుంచి నవంబరు 2022 వరకు సుమారు రూ.398 కోట్లకుపైగా ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు రావడంతో సాయిబాబా సంస్థాన్ చరిత్రలో సరికొత్త రికార్డుగా నమోదైంది.

విరాళాల రూపంలో రూ.77,89,04,984, హుండీలో కానుకల రూపంలో రూ.1,68,88,52,560, చెక్కులు, డీడీల రూపంలో రూ.19,68,41,408 కోట్లు వచ్చాయి. డెబిట్, క్రెడిట్ కార్డు డొనేషన్ ద్వారా రూ.42,00,42,120కోట్లు, మనీఆర్డర్ల ద్వారా రూ.2,29,76,564కోట్లు జమ అయ్యాయి. 27కిలోల బంగారం, 3,056కిలోల వెండితో కలిపి మొత్తం ఈ ఏడాది బాబా సంస్థాన్ ఆదాయం రూ.3,98,53,31,511కోట్లు వచ్చినట్లు సాయి సంస్థాన్​ చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ ఆఫీసర్​ భాగ్యశ్రీ బనాయత్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news