బ్యాంకుల్లో కరెన్సీ లేక ఆగిన రూ.2000 నోట్ల మార్పిడి

-

కొన్నేళ్ల క్రితం పెద్ద నోట్ల రద్దయినప్పుడు బ్యాంకులకు కరెన్సీ కష్టాలు వచ్చింది చూశాం. ఇప్పుడు రెండువేల నోట్ల రద్దుతో మళ్లీ బ్యాంకులు ఆపసోపాలు పడుతున్నాయి. రూ.2000 నోట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) చలామణి నుంచి ఉపసంహరిస్తున్న నేపథ్యంలో వాటిని మార్చి ఇచ్చేందుకు ఆయా బ్యాంకు శాఖల్లో నోట్ల కొరత ఏర్పడుతోంది.

పెద్ద ఎత్తున జనాలు బ్యాంకులకు వస్తుండటంతో నగదు లేక నోట్ల మార్పిడి ప్రక్రియను బుధవారం రోజున తాత్కాలికంగా నిలిచిపోయింది. మంగళవారం నుంచే రూ.2000 నోట్ల మార్పిడి మొదలవగా, రెండో రోజే బ్యాంకులకు కరెన్సీ కష్టాలు రావడం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. రూ.500, రూ.200, రూ.100 నోట్లు సరిపడా బ్యాంకు శాఖల్లో ఉండటం లేదని చెబున్నారు. చేసేదేం లేక బ్యాంకర్లు చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఫలితంగా నోట్ల మార్పిడి కోసం బ్యాంకులకు వచ్చిన ప్రజలకు ఇబ్బందులు తప్పట్లేదు. ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఈ నోట్ల మార్పిడి ప్రక్రియను నిరంతరం పరిశీలిస్తున్నామని చెబుతున్నా.. పర్యవేక్షణ లోపం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. నోట్ల మార్పిడి మొదలైన రెండో రోజే బ్యాంకుల్లో కరెన్సీ కొరత ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news