నేపాల్ లో రోడ్డు ప్రమాదం.. ఆరుగురు భారతీయులు మృతి

-

నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేపాల్ లోని బారా జిల్లాలో గురువారం ఉదయం ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీత్పూర్ సిమారా లోని చురియామై దేవాలయం సమీపంలో ఓ బస్సు లోయలో పడిపోవడంతో ఆరుగురు మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హేటౌడాలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో దాదాపు 25 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని బస్సు డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. భారత్ కి చెందిన యాత్రికులు ఖాట్మండు నుండి జానక్పూర్ వెళుతుండగా 15 మీటర్ల లోయలో బస్సు పడిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news