రెండుమూడు రోజుల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు: ఐఎండీ

-

భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) తీపి కబురు చెప్పింది. మరో రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించనున్నాయి. ముందుగా కేరళ తీరాన్ని రెండు మూడు రోజుల్లో తాకనున్నట్లు ఐఎండీ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది.

ప్రస్తుతం భారత్ తో అక్కడక్కడ వర్షాలు కురుస్తుండటంతో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని ఐఎండీ వెల్లడించింది. రాబోయే 5 రోజులు దేశంలో వడగాలుల పరిస్థితులు ఉండదని తెలిపింది. పశ్చిమ హిమాలయ ప్రాంతంలో వర్షాలు కురుస్తాయని.. వచ్చే 2 రోజులు ఢిల్లీలో ఆకాశం మేఘావృతమైన వాతావరణం ఉంటుందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని మరిన్ని ప్రాంతాలు, లక్షద్వీప్‌లోని కొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించాయని వెల్లడించింది ఐఎండీ. గత 24 గంటల్లో, కేరళ తీరం, ఆగ్నేయ అరేబియా సముద్రంలో మేఘాల ఉనికి పెరిగిందని తెలిపింది. ఈ సారి సాధారణం కన్నా ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకబోతున్నాయి. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతమే నమోదు అవుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news