తమిళనాడు ప్రభుత్వానికి స్టేట్ ఇంటిలిజెంట్ తీవ్ర హెచ్చరిక

-

తమిళనాడు ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది స్టేట్ ఇంటిలిజెన్స్. అదా శర్మ ప్రధాన పాత్రలో సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “ది కేరళ స్టోరీ’. అయితే ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ పెద్ద వివాదానికి దారి తీసింది. ఈ ట్రైలర్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేరళలో బలవంతపు మతమార్పిడులు జరుగుతున్నాయనే ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర నిర్మాతలు వెల్లడిస్తున్నారు.

అయితే సిపిఎం, కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఈ సినిమా హిందూ – ముస్లిం వైశమ్యాలు, సెక్యులరిజానికి వ్యతిరేకంగా ఉన్నాయని, ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలపై స్టాలిన్ ప్రభుత్వానికి స్టేట్ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ సినిమా విడుదలయితే పెద్ద ఎత్తున ఆందోళనలు చలరేగే అవకాశం ఉందని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news