రోజురోజుకు దిగజారుతున్న ఐటీ ఉద్యోగుల పరిస్థితి.. రెండు వారాల్లోనే వేలాది ఉద్యోగాలు మాయం

-

కరోనా కారణంగా..  గత రెండేళ్లుగా ఉద్యోగాలు తుమ్మితే ఊడిపోయేలా మారిపోయాయి.. ఇంకా ప్రభావం పోనట్టుంది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫ్లిప్‌కార్ట్ వంటి బహుళ జాతి టెక్ కంపెనీలు 2024 లో భారీ లే ఆఫ్స్‌కు తెర తీశాయి. కొత్త సంవత్సరం మొదటి రెండు వారాల్లో అనేక విభాగాల్లో వేలాది ఉద్యోగాలను తగ్గించాయి. దాంతో, ప్రస్తుతం ఐటీ మార్కెట్‌లో ఉద్యోగాలు చేస్తున్నవారి పరిస్థితి దినదినగండం నూరేళ్ల ఆయుష్యు అన్నమాదిరిగా మారిపోయింది.
వాయిస్ అసిస్టెంట్, హార్డ్‌వేర్ విభాగాల్లో వందలాది ఉద్యోగాలను తగ్గించాలని గూగుల్ నిర్ణయించింది. వాటిలో Fitbit సహ వ్యవస్థాపకులు జేమ్స్ పార్క్, ఎరిక్ ఫ్రైడ్‌మాన్‌లు కూడా ఉండడం విశేషం. ఇంకా, మైక్రోసాఫ్ట్ సపోర్ట్ చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘‘హ్యూమేన్ ఏఐ (HumaneAI)’’ తన మొత్తం వర్క్‌ఫోర్స్‌లో నాలుగు శాతం మందిని తొలగించాలని ఫిక్స్‌ అయింది. సంస్థ మొదటి ప్రొడక్ట్ అయిన వాయిస్-కంట్రోల్ హ్యాండ్స్‌ఫ్రీ AI పిన్‌ను ప్రారంభించడానికి ముందే హ్యూమేన్ ఏఐ (HumaneAI) ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఉద్యోగులను తొలగించబోతున్నామని 2024లో  పేటీఎం ప్రకటింటింది. ఈ రెండు వారాల్లో ఈ సంస్థ దాదాపు 1000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది సంస్థ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 10 శాతం. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పే టీఎం చెబుతోంది.
ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ కూడా లే ఆఫ్ ప్రక్రియ ప్రారంభించింది. తన మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 5-7 శాతం మందిని తొలగించే యోచనలో ఫ్లిప్ కార్ట్ ఉంది. కంపెనీ ఆర్థిక పనితీరు మందగించిన కారణంగా ఈ తొలగింపులు అనివార్యమయ్యాయని కంపెనీ చెబుతోంది. ఆమెజాన్ తన ప్రైమ్ డివిజన్ నుండి వందలాది మందిని తొలగించాలని భావిస్తోంది. వారిలో ఎక్కువగా కస్టమర్ సర్వీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న భారతీయ రిమోట్ కార్మికులు కావచ్చు.
గూగుల్  తన వాయిస్ అసిస్టెంట్, ఇంజినీరింగ్, హార్డ్‌వేర్ విభాగంలో ఉద్యోగాల కోత విధించనున్నట్లు ప్రకటించింది. Pixel, Nest ల నుండి వందల మందిని తొలగించింది. వీరిలో దాదాపుగా Fitbit సిబ్బంది మొత్తం ఉన్నారు. ప్రస్తుత లే ఆఫ్ సీజన్‌కు కారణం గత దశాబ్దంలో జాబ్ మార్కెట్ బూగీమ్యాన్‌గా పేరుగాంచిన కృత్రిమ మేథ (AI) యేనని అందరూ భావిస్తున్నారు. ఇప్పుడు ఐటీ, టెక్ దిగ్గజ కంపెనీలలో ఎక్కువ శాతం ఉద్యోగాల కోత AI పురోగతి కారణంగానే అన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు, ద్రవ్యోల్బణం కంపెనీల లాభాలను తినేస్తోంది. దాంతో.. ఉద్యోగుల్లో కొంతమందిని తొలగించక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో..! ఇక ఉద్యోగాలు మానేసి.. వ్యాపారాలు పెడితేనే.. ప్రశాతంగా ఉండేచ్చోమో.!

Read more RELATED
Recommended to you

Latest news