రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 2కు తేదీ ఖరారు

-

కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దేశవ్యాప్తంగా తొలివిడుదల కొనసాగించిన విషయం తెలిసిందే. మొదటి విడుత భారత్ జోడో యాత్రకు అశేషమైన ఆదరణ లభించడంతో కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ మరోసారి యాత్రకు పిలుపునిచ్చారు. అక్టోబర్ 2 నుంచి ఈ మేరకు యాత్ర ప్రారంభం కానుంది. లఢక్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ మరోసారి దేశం మొత్తం యాత్ర చేేసేందుకు పూనుకున్నారు.

కాంగ్రెస్ ను ప్రజల వద్దకు తీసుకుపోవడానికి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకునేందుకు మరోసారి నడుం బిగించారు. తొలిసారి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్ర కొనసాగించారు రాహుల్ గాంధీ. రెండోసారి భారత్ జోడో యాత్రలో భాగంగా గుజరాత్ నుంచి మేఘాలయా వరకు పర్యటించనున్నారని సమాచారం. 2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో జోడో యాత్ర ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ యాత్రలో కాంగ్రెస్ పార్టీలో చేసిన అభివృద్ధితో పాటు బీజేపీ ప్రభుత్వం వల్ల అన్నీ ధరలు పెరిగిపోయాయని ప్రచారం చేయనున్నారు రాహుల్ గాంధీ. 

Read more RELATED
Recommended to you

Latest news