మాట నిలబెట్టుకున్న ప్రధాని.. తన స్కెచ్ వేసిన చిన్నారికి ప్రత్యేక లేఖ..!

-

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఓ చిన్నారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇటీవల ఛతీస్‌గఢ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధానిని.. ఓ బాలిక ఆకర్షించింది. ఆమె పేరు ఆకాంక్ష ఠాకూర్. కంకేర్ ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తున్న సమయంలో.. ఆ బాలిక చేతిలో ప్రధాని స్కెచ్‌ పట్టుకున్న కనిపించింది. ఇక దాన్ని గమనించిన ప్రధాని మోడీ ఆమెను ఎంతగానో మెచ్చుకున్నారు. ఆమె గురించి ప్రస్తావిస్తూ ప్రత్యేకంగా ఓ లేఖను కూడా రాశారు.

‘ప్రియమైన ఆకాంక్ష, నీకు ఎలప్పుడూ అదృష్టం, ఆశీర్వాదాలు లభించాలని కోరుకుంటున్నా. కంకేర్ ర్యాలీ కార్యక్రమానికి మీరు తీసుకువచ్చిన స్కెచ్ నాకు చేరింది. మీ ఆప్యాయత వ్యక్తీకరణకు ధన్యవాదాలు” అని ప్రధాని లేఖలో పేర్కొన్నారు. ‘భారతదేశపు కుమార్తెలు దేశానికి ఉజ్వల భవిష్యత్తు. మీ అందరి నుంచి నేను పొందుతున్న ఈ ఆప్యాయత, అనుబంధం దేశ సేవ చేయడంలో నాకు కొండంత బలం. మన కుమార్తెల కోసం ఆరోగ్యకరమైన, సురక్షితమైన, సుసంపన్నమైన దేశాన్ని నిర్మించడమే మా లక్ష్యం’ అని అన్నారు.

రాబోయే 25 ఏళ్లు దేశానికి మీలాంటి యువత ఎంతగానో అవసరమని తెలిపారు. అలాగే మీలాంటి కుమార్తెలు ఎన్నో సంచలనాలు నమోదు చేసి.. దేశ భవిష్యత్తుకు కొత్త దిశను అందిస్తున్నారన్నారు ప్రధాని మోడీ. మీరు కష్టపడి చదవి.. ముందుకు సాగండి. మీ విజయాలతో మీ కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఎనలేని కీర్తిని తీసుకురండి. మీ ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ.

Read more RELATED
Recommended to you

Latest news