వెరైటీ దొంగలు.. ATMలో డబ్బు వదిలేసి.. AC చోరీ

-

అది ఆదివారం సాయంత్ర సమయం. ఇద్దరు వ్యక్తులు బైక్​పై వచ్చారు. అక్కడ ఉన్న ఓ ఏటీఎంలో చొరబడ్డారు. అందులో ఓ వ్యక్తి అక్కడే ఉన్న డస్ట్​బిన్​ను తిరగేసి దానిపై ఎక్కి.. ఏటీఎం సెంటర్​లో ఉన్న ఏసీ వైర్​లను కత్తిరించాడు. ఆ తర్వాత ఏసీని బయటకు తీసి.. పట్టుకుని అదే బైక్​పై అక్కడి నుంచి దర్జాగా వెళ్లిపోయారు. అక్కడ సీసీ టీవీ ఉన్నది గమనించలేదు. ఈ దృశ్యాలన్నీ అందులో రికార్డవ్వడంతో ఈ చోరీ విషయం బయటకు వచ్చింది. ఈ సంఘటన పంజాబ్​లోని మోగా జిల్లాలో చోటుచేసుకుంది.

అయితే ఏటీఎంలోకి వచ్చి డబ్బు తీసుకోకుండా.. ఏదో సూపర్ మార్కెట్​కు వెళ్లి చిప్స్ ప్యాకెట్ పట్టుకుని పోయినట్లు ఏసీని తీసుకెళ్లిన విధానం చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఈ ఘటనపై ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదని సమాచారం. గతంలో కూడా బ్యాంకుకు చెందిన మోటారు సైకిల్ కూడా చోరీకి గురైన సమయంలోనూ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news