ప్రమాద సమయంలో రిషభ్ పంత్​కు సాయపడిన ఆ ‘ఇద్దరు’

-

ప్రమాదం జరిగినప్పుడు ఆ ఘటనలో గాయపడ్డ వ్యక్తిని కాపాడారు. అంతేకాకుండా ఆ వ్యక్తికి సంబంధించిన విలువైన సామగ్రిని కాలిపోకుండా బయటకు తీశారు. ప్రమాద సమయంలో తీసిన నగదును పోలీసులకు నిజాయతీగా అప్పగించారు. వారి నిజాయతీని ఇప్పుడు యావత్ భారత్ మెచ్చుకుంటోంది. ఎందుకంటే వాళ్లు సాయం చేసింది ఓ సాధారణ వ్యక్తికి కాదు. ఇండియన్ స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్​కు.

భారత స్టార్‌ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ రోడ్డు ప్రమాదానికి గురైన సమయంలో అతడికి ఇద్దరు యువకులు సాయపడ్డారు. వారే రజత్‌ కుమార్‌, నిషు కుమార్‌. అంతే కాదు.. రిషభ్‌ కారు కాలిపోతున్న సమయంలో క్రికెటర్‌ వస్తువులు, నగదును ఇద్దరూ బయటకు తీశారు. అలా ప్రమాద సమయంలో కారులో నుంచి తీసిన రూ.4వేలను పోలీసులకు నిజాయతీగా వారు అందించారు.

వీరు చేసిన పనిపట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే వీరిద్దరూ మ్యాక్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పంత్‌ను పరామర్శించారు. మరోవైపు రిషభ్ కోలుకుంటున్న సంగతి తెలిసిందే. సోమవారం రోజు పంత్​ను ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు షిఫ్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news