డబుల్ ఇంజన్ సర్కార్ తో యూపీ అభివృద్ధి చెందుతోంది : పీఎం మోడీ

-

ఉత్తరప్రదేశ్ లో ఒకప్పుడు కర్ప్యూలు, ఘర్షణలు ఉండేవి అని.. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ కారణంగా యూవీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. తాజాగా ఉత్తర ప్రదేశ్ లో 10లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు ప్రధాని. అనంతరం  ఏర్పాటు చేసిన   సమావేశంలో మాట్లాడారు పీఎం మోడీ.

యూపీలో పెట్టుబడులు అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. భారత్ లో జరుగుతున్న అభివృద్ధి పై ఇతర దేశాలు కూడా చర్చించుకుంటున్నాయి. యూపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న నాకు ఇంతకంటే సంతోషం ఏముంటుందని పేర్కొన్నారు ప్రధాని. గతంలో ఏవో ఒకటి రెండు చోట్ల అభివృద్ధి చేసి అవి తమ ఘనతగా చెప్పుకునే వారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని తెలిపారు మోడీ. బీజేపీ ప్రభుత్వ హయాంలో అందరికీ సామాజిక న్యాయం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వం పేదల గురించి అసలు పట్టించుకోలేదని.. మా ప్రభుత్వం పేదల సమస్యలను పరిష్కరించడం కోసమే ఏర్పడిందని.. ఇది మోడీ గ్యారెంటీ అని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news